రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో మరో రికార్డ్ లిఖించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యధిక సార్లు (8 సార్లు) 500కుపైగా పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా విరాట్ రికార్డు సృష్టించాడు.
ఆ తర్వాత అత్యధికంగా ఐపీఎల్లో 500+ పరుగులు చేసిన వారిలో డేవిడ్ వార్నర్ (8 సార్లు), కేఎల్ రాహుల్ (8 సార్లు), శిఖర్ ధావన్ (8 సార్లు), సురేష్ రైనా (8 సార్లు), క్రిస్ గేల్ (8 సార్లు) ఉన్నారు.
ఇక ప్రస్తుం నేడు సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్ తో ఈ సీజన్ లో 500 పరుగుల మార్కును చేరుకున్న విరాట్ కోహ్లీ.. 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను గెలుచుకున్నాడు. సాయి సుదర్శన్ 504 పరుగులతో రెండో స్థానంలో, సూర్య కుమార్ యాదవ్ 475 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.