Vikram Misri | సీజ్ ఫైర్ ఉల్లంఘ‌నను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నాం..

భారత్ – పాక్ మధ్య కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పుల విర‌మ‌ణ అమ్మల్లోకి వ‌చ్చిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే పాక్ త‌న వక్ర బుద్ది ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్.. అంతర్జాతీయ సరిహద్దుతోపాటు నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో దాడులకు దిగింది.

దీనికి సంబంధించి శ్రీనగర్‌లో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా వీడియో పోస్ట్ చేశారు.

దీనిపై స్పందించిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనను భారత్ తీవ్రంగా పరిగణిస్తోందని అన్నారు. పాకిస్థాన్ డ్రోన్ల‌తో స‌రిహ‌ద్దు పొడువున కాల్పుల‌కు పాల్ప‌డింద‌ని ఆయ‌న పేర్కోన్నారు. పాక్ కాల్పుల‌ను భ‌రాత సైన్యం స‌వ‌ర్ధ‌వంతంగా తిప్పికొడుతుందిన మిస్రీ వెల్ల‌డించారు.

డీజీఎంఓ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఉల్లంఘనను భారత్ ఖండిస్తుందని చెప్పిన విక్రమ్ మిస్రీ.. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పూర్తిగా పాకిస్తాన్ దే బాధ్యత అని అన్నారు. కాల్పుల విరమణ ఉల్లంఘనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌ను హెచ్చరించినట్లు చెప్పారు.

పాక్ దాడుల‌పై భద్రతా దళాలు వెంటనే స్పందించాయని మిస్రి అన్నారు. ప్ర‌స్తుత‌ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామ‌ని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *