శ్రీనగర్లో మళ్లీ డ్రోన్ల కలకలం రేపుతోంది. భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన మూడు గంటల్లోనే సరిహద్దులో మళ్లీ కాల్పులు చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించింది. జమ్మూ సెక్టార్లో పాకిస్థిన్ సీజ్ ఫైర్ ఉల్లంఘించినట్టు తెలుస్తోంది.
శ్రీనగర్లోని ఆరు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు సమాచారం. డ్రోన్ దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, శ్రీనగ్ లో డ్రోన్లు తిరుగుతున్నట్టు ఓ ట్వీట్ షేర్ చేసిన కశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా… ఇక సీజ్ ఫైర్ లేనట్టేనని పేర్కొన్నారు. శ్రీనగర్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివ్ అయ్యిందని, డ్రోన్లు కనిపిస్తే కూల్చివేయాలని బీఎస్ఎఫ్కు ఆదేశాలు జారీ చేశారు.
సరిహద్దు నగరాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. పంజాబ్లోని గురుదాస్పూర్, రాజస్థాన్లోని బార్మెర్, గుజరాత్లోని కచ్లలో డ్రోన్ దాడులు జరిగుతున్నాయి. శ్రీనగర్లోని చినార్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్ దాడికి పాల్పడింది. భారత వైమానిక రక్షణ దళాలు పాక్ డ్రోన్లను కూల్చివేసాయి.
శ్రీనగర్, జమ్ము, ఫారోజ్ పూర్, పఠాన్ కోట్, బికనీర్ తోపాటు… రాజస్థాన్ సరిహద్దులోని బార్మర్, జైసల్మేర్ నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాక్ ఔట్ అమ్మలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.