High Court | జగిత్యాల సభకు దూరం

High Court | జగిత్యాల సభకు దూరం
High Court | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఇవాళ జగిత్యాలలో జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు మాజీ మంత్రి, పార్టీ కీలక నేత హరీష్రావు దూరంగా హాజరు కావడం లేదని పార్టీవర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ కీలక కేసులో ఎల్లుండి హైకోర్టు తీర్పు వెలువడనుంది. ఈ తీర్పు పార్టీకి లేదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వస్తే.. తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ముందస్తుగా లీగల్ గ్రౌండ్స్ సిద్ధం చేసుకోవడం కోసమే హరీశ్ రావు అకస్మాత్తుగా ఢిల్లీకి పయనమయ్యారు. చట్టపరమైన అంశాలపై చర్చించేందుకు హరీష్రావుతో పాటు మాజీ ఎంపీ వినోద్ రావు కూడా ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో వారు భేటీ కానున్నారు.
