24yrs woman | చెన్నూరులో దారుణం..

24yrs woman | చెన్నూరులో దారుణం..

24yrs woman | ఎల్లక్కపేట గ్రామంలో కలకలం రేపిన ఘటన
తల్లి మృతితో అనాథలైన ఇద్దరు చిన్నారులు
భర్తపై అనుమానాలు.. సుత్తితో దాడి చేసినట్లు సమాచారం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఎల్లక్కపేట గ్రామంలో చోటుచేసుకున్న ఓ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన చల్ల శారద (24) అనే వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన గ్రామంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.

24yrs woman
24yrs woman

మృతురాలు శారదకు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నట్లు సమాచారం. తల్లి మృతితో ఆ చిన్నారులు అనాథలవుతున్న పరిస్థితి గ్రామస్తులను కలచివేస్తోంది. నిత్యం కుటుంబ బాధ్యతలతో గడిపే యువ గృహిణి ఇలా అర్ధాంతరంగా మృతిచెందడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాథమిక సమాచారం మేరకు, ఈ హత్యను ఆమె భర్త రమేష్ సుత్తితో దాడి చేసి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనకు గల అసలు కారణాలు ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కుటుంబ కలహాలేదారుణానికి దారితీసి ఉండవచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనతో ఎల్లక్కపేట గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువతి మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ అనంతరం మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

click here to read more

click here to read మహిళ ఆత్మహత్యాయత్నం

Leave a Reply