War Zone | పాక్ కుయుక్తులు తిప్పి కొడుతున్న భార‌త్..

భారతదేశంపై దాడి చేయడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నానికి భారతదేశం తగిన సమాధానం ఇచ్చింది. పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను భార‌త్ ధ్వంసం చేసింది. 12 పాక్ డ్రోన్లు, మూడు ఫైట‌ర్ జెట్ల‌ను నేల‌మ‌ట్టం చేసిన భార‌త్.. పాకిస్తాన్ కు చెందిన పైలెట్ ను అదుపులోకి తీసుకుంది.

భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులను ప్రయోగించడానికి ప్రయత్నించింది. అయితే, పాకిస్తాన్ దాడులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. కైనెటిక్ (భౌతిక) మరియు నాన్-కైనెటిక్ (అభౌతిక) సామర్థ్యాలను ఉపయోగించి ఈ ముప్పులను తక్షణమే నిర్వీర్యం చేసినట్లు అధికారులు వివరించారు.

అవంతిపోరా, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, అడంపూర్, బటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, భుజ్ ఇతర ప్రాంతాలలో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాక్ ప్రయత్నించింది. అయితే, వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఎస్ఏ గ్రిడ్, వాయు రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా అడ్డగించినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

పాకిస్తాన్ ప్రయోగించిన ఎనిమిది క్షిపణులతో పాటు, ఒక పాకిస్తాన్ F-15 ఫైటర్ జెట్, రెండు JF-17 ఫైటర్ జెట్లను కూడా కూల్చివేసారు. ఇక పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని రక్షణ శాఖ వెల్లడించింది. జ‌మ్ము ఎయిర్ పోర్టుకు ఎలాంటి నష్టం జ‌ర‌గ‌లేద‌ని తెలిపింద‌. ఎయిర్ పోర్ట్ ట‌ర్మిన‌ల్లో ఉన్న సంద‌ర్శ‌కుల‌ను వెంట‌నే ఖాలీ చేయించాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

పాక్ పై భార‌త్ ఎదురుడాడి…

పాక్ దుశ్చర్యతో భారత్‌ ప్రతీకార దాడులకు దిగింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ధ్వంసమైంది.

లాహోర్, సియాల్ కోట్ వరకు వెళ్లిన భారత డ్రోన్లు.. పాక్ డిఫెన్స్ సిస్టమ్ ను సర్వనాశనం చేశాయి. లాహోర్ తో పాటు 9 పాకిస్తాన్ నగరాల్లో (రావల్పిండి, లాహరో, గుర్జన్ వాలా, చక్ వాల్, అట్టోక్, బహవల్ పూర్, మియాన్ వలీ, కరాచీ, ఛోర్) ఇండియన్ ఆర్మీ డ్రోన్లతో అటాక్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *