తెలంగాణలో మందు బాబులకు పెద్ద షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను సవరించింది. ప్రస్తుతం ఉన్న బీర్ల ధరపై 15 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ పెరిగిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జైస్వాల్ కమిటీ సూచన మేరకే ధరలు పెంచినట్లు పేర్కొంది.