Funeral| ప్రభుత్వ అధికార లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ కు అంతిమ సంస్కారాలు

హైదరాబాద్ : : ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. . ఆయన అంత్యక్రియలను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో జరుగనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది. అదేవిధంగా దవాఖానలో ఆయన చికిత్సకు అయిన ఖర్చును చెల్లించనున్నట్లు వెల్లడించింది

మరోవైపు ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్దివ దేహాన్ని మాదాపూర్ కావూరి హిల్స్‌లోని మాగంటి నివాసానికి తరలించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావు , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్‌, వివేకానంద్‌, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ కుమార్‌, పార్టీ నేతలు వినోద్‌ కుమార్‌, మాలోత్‌ కవిత, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించారు. గోపీనాథ్‌ను చివరిసారిగా చూసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. గోపీనాథ్‌ భూతికకాయానికి నివాళులర్పిస్తున్నారు.

ఎమ్మెల్సీ కవిత సంతాపం..

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆయన అకాల మరణం హైదరాబాద్ నగర ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని, మాగంటి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని.. శోఖార్తులైన ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని కవిత అన్నారు.

మాగంటితో 40 ఏళ్ల అనుబంధం…

కూకట్‌ల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి బాధాకరమని.. ఆయనతో తనకు 40 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి తామిద్దరం కలిసి పని చేశామని.. గత నెల 22వ మాగంటి చివరిగా తనతో మాట్లాడారని తెలిపారు. ఆరోగ్య సమస్యల గురించి చెబుతూ చాలా ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు. మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయామని, గోపీనాథ్ మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

రావుల సంతాపం..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని రాజ్యసభ మాజీ సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. మాగంటి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన జీవితం ఆదర్శమని అన్నారు. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *