Notice | ఫరీక్ష ఫీజు వాపసు
Notice | ఫరీక్ష ఫీజు వాపసు
Notice | నోటీఫికేషన్ విడుదల చేసిన ఎన్టీఎ
27లోగా బ్యాంక్ వివరాలు ఇవ్వాలని ఆదేశం
Notice | న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ)-2026 పరీక్ష ఫీజు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించేందుకు రీఫండ్ పోర్టల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఎన్టీఏ జారీ చేసిన నోటీసు ప్రకారం, నీట్ (యూజీ) రిజిస్ట్రేషన్ పోర్టల్లో రీఫండ్ ఆప్షన్ను తెరిచారు. అభ్యర్థులు తమ లాగిన్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అయి, రీఫండ్ లింక్పై క్లిక్ చేసి తమ బ్యాంక్ ఖాతా వివరాలను సమర్పించవచ్చు. చివరి గడువు: మే 27, 2026 (రాత్రి 11:50 గంటల వరకు)
ముఖ్య సూచనలు
అభ్యర్థులు ఖాతా వివరాల ఖచ్చితత్వం కోసం రద్దు చేయబడిన చెక్కును అప్లోడ్ చేయవచ్చు. అయితే ఇది తప్పనిసరి కాదు. ఒకసారి వివరాలు సమర్పించిన తర్వాత అవి తుదిగా పరిగణించబడతాయి. తర్వాత ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు. అనుబంధం-Iలో ఇవ్వబడిన అన్ని వివరాలను సరిగ్గా పూరించాలి. కాగా, అభ్యర్థులు చార్జ్బ్యాక్ అభ్యర్థనలు చేయవద్దని ఎన్టీఎ సూచించింది. బ్యాంక్ ఖాతా వివరాలు సమర్పించడం ద్వారా మాత్రమే రీఫండ్ ప్రక్రియ పూర్తి చేయనుంది.
రీఫండ్ కోసం దరఖాస్తు చేసే విధానం
అధికారిక NTA NEET UG వెబ్సైట్ను సందర్శించండి
“Fee Refund Portal 2026” లింక్పై క్లిక్ చేయండి
అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి
రీఫండ్ ఫారమ్ను జాగ్రత్తగా పూర్తి చేయండి
అవసరమైన బ్యాంక్ వివరాలు నమోదు చేయండి
సబ్మిట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోండి
