Champions Trophy – అయిదుగురు స్పిన్న‌ర్ ల‌తో ఆస్ర్టేలియా…

దుబాయ్ .- చాంపియ‌న్స్ ట్రోఫీ సెమీస్ లో ఆస్ట్రేలియా ఏకంగా అయిదుగురు స్పిన్న‌ర్ ల‌తో బ‌రిలోకి దిగింది. భార‌త్ కు ఎదుర్కొనేందుకు స్పిన్ తంత్రాన్ని ప్ర‌యోగించ‌నుంది. న‌లుగురు స్పిన్న‌ర‌ల‌తో బ‌రిలోకి దిగి న్యూజిల్యాండ్ పై విజ‌యం సాధించిన ఇండియా టీమ్ ను స్ఫూర్తిగా తీసుకున్న ఆసీస్ ఇప్పుడు అదే స్పిన్ తంత్రాన్ని మ‌న‌పై ప్ర‌యాగించేందుకు సిద్ద‌మైంది. జంపా, తన్వీర్, కూపర్, మ్యాక్స్వెల్ లో లబుషేన్ తో కూడా స్పిన్ బౌలింగ్ చేయించ‌నుంది.. మ‌న కంటే ఒక స్పిన్న‌ర్ ను అద‌నంగానే జ‌ట్టులోకి తీసుకుంది.

ఆస్ట్రేలియా జట్టు – కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా

ఇందులో జంపా, తన్వీర్, కూపర్, మ్యాక్స్వెల్ లు స్పిన్న‌ర్ లు .. ఇక లబుషేన్ కూడా స్పిన్ కమ్ పేసర్ బౌలర్

Leave a Reply