మహబూబాబాద్ : జిల్లాలోని గంగారం మండలం కాటినగరం గ్రామానికి చెందిన నరేష్, యశోదల కూతురు మూతి శ్రావణి (12) తన స్నేహితులతో కలిసి కోమట్లగూడెం (Komatlagudem) పెద్ద చెరువులో ఈతకు వెళ్లింది. అయితే ఈతకెళ్లిన శ్రావణి (Shravani) నీటి గుంతలో పడి మృతిచెందింది. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత (బాలికల) పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. శ్రావణి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
TG | ఈతకెళ్లి విద్యార్థిని మృతి
