Attack | ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి – మిలటరీ చీఫ్ తో సహా పలువురు మృతి

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ను (Teharan) లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ (israel) బాంబులు వేసింది. ఈ దాడితో మొత్తం టెహ్రాన్ కుదుపుకు గురైంది.

ఈ దాడిలో ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలను ( Nuclear plants) ధ్వంసం చేసింది. టెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు కొత్త శిఖరాలకు చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది.

ఈ భీకర దాడుల్లో ఇరాన్‌ (Iran) పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించారు. ఈమేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.’ ‘ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఈ దళం అధిపతి మేజర్‌ జనరల్‌ హొస్సేన్‌ సలామీ మరణించారు” అని ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈయనతో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర టాప్‌ అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు తెలిపాయి. సలామీ మృతిని ఇరాన్‌ అధికారిక మీడియా సంస్థ ధ్రువీకరించింది

ఈ దాడులను ఇరాన్‌ కూడా ధ్రువీకరించింది. ఇందులో అనేకమంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపింది. కెర్మాన్‌షా, లోరెస్తాన్‌, టెహ్రాన్‌లలోని పలు ప్రాంతాల్లో ఈ పేలుళ్లు జరిగినట్లు పేర్కొంది.

ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ ‘లక్ష్యంగా చేసుకున్న’ ఆపరేషన్‌ను ప్రారంభించిందని అన్నారు. ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నామని నెతన్యాహు అన్నారు. ఈ దాడిలో ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ పేర్కొంది. అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత.. ఇజ్రాయెల్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది.

అణు స్థావరాలు ధ్వంసంటెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు కొత్త శిఖరాలకు చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయబోతోందని వస్తున్నాయి. ఈ వినిపిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి చాలా పెద్దది. ఎందుకంటే ఈ దాడి లక్ష్యం కేవలం ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడమే అన్నట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడి.. తమ హెచ్చరిక నిజమని నిరూపించుకుంది.ఇజ్రాయెల్ సైనిక అధికారి ఒకరు మాట్లాడుతూ తమ దేశం ఇరాన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని సైనిక లక్ష్యాలను గుర్తించలేదని అన్నారు.

ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ.. తమ దేశం ఇరాన్‌పై దాడి చేసిందని.. అయితే ఏ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారనే వివరాలను వెల్లడించలేదు

.ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఈ దాడి తర్వాత ఇరాన్ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోగలదని రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు ఇరాన్ దాడి చేస్తుందని భావించి ఇజ్రాయెల్ దేశంలో క్షిపణులు, డ్రోన్‌లతో సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఇజ్రాయెల్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించే ప్రత్యేక ఉత్తర్వుపై కాట్జ్ సంతకం చేసినట్లు వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *