ఫోన్ చోరీ.. ఖాతాలో రూ.1.49 లక్షలు మాయం…

సత్తెనపల్లి, ఆంధ్రప్రభ : సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు చెందిన వల్లెపు సహదేవుడి సెల్‌ఫోన్ గత నెల తిరునాళ్లలో చోరీకి గురైంది. ఇటీవల బ్యాంక్‌కు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో ఆరా తీయగా రూ.1.49 లక్షలు విడతల వారీగా డ్రా అయినట్లు తెలిసింది. సెల్‌ఫోన్ దొంగిలించిన వారే నగదు తీసి ఉంటారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ సీఐ హైమారావు తెలిపారు.