SLBC | సీఎం రేవంత్ కి ప్రధాని మోదీ ఫోన్ !!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శ్రీశైలం ఎడమ కాల్వలో ఉన్న టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా తీశారు. ప్రమాదం ఎలా జరిగింది? కార్మికులకు రక్షణ కల్పించాలా? సొరంగంలో ఎంత మంది చిక్కుకున్నారు? అని రేవంత్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించినట్లు సమాచారం.
టన్నెల్ ప్రమాదంపై…
కాగా, ఈరోజు ఉదయం 8.30 గంటల సమయంలో ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో టన్నెల్ లో 40 మంది కార్మికులు ఉండగా, 32 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.
సింగరేణినుంచి రెస్క్యూ టీంను తెప్పించి సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని, ఎనిమిది మంది కార్మికులను రక్షించే ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు.