AP | నిరసన ర్యాలీలో సీఎం చంద్రబాబు

AP | నిరసన ర్యాలీలో సీఎం చంద్రబాబు
AP | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడం ఏపీలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నిడదవోలులో నిర్వహించిన నిరసన ర్యాలీలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. బిల్లును విపక్షాలు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బిల్లును అడ్డుకున్న పార్టీలకు శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. దేశం మొత్తం విపక్షాల తీరును వివరిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.
