సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి..

సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడి..
160 క్వింటాళ్ల చౌక బియ్యం స్వాధీనం
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని చింతచెట్టు సెంటర్ వద్ద బుధవారం తెల్లవారుజామున సివిల్ సప్లై అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఉదయం నాలుగు గంటల సమయంలో చౌక బియ్యాన్ని లారీలో అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. తనిఖీల్లో అనుమతి లేకుండా తరలిస్తున్న సుమారు 160 క్వింటాళ్ల చౌక బియ్యం ను అధికారులు గుర్తించారు. వెంటనే ఆ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని పోలీసుల సహాయంతో ఇరుగుదురు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, బియ్యం అక్రమ రవాణా వెనుక ఉన్న వారిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
