1984memory | ఎన్టీఆర్ షాకింగ్ ఆఫర్ వెనుక నిజం

1984memory | ఎన్టీఆర్ షాకింగ్ ఆఫర్ వెనుక నిజం

1984memory | బలమైన బంధం నుంచి విభేదాల వరకు
కీలక నిర్ణయాలపై అభిప్రాయ ఘర్షణ
ఎన్టీఆర్ – నాదెండ్ల హైడ్రామా
ఆగస్టు సంక్షోభానికి పునాది ఎలా పడింది?
31 రోజుల్లో ముగిసిన ముఖ్యమంత్రి పదవి

1984memory | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొలినాళ్లలో ఎన్టీఆర్, నాదెండ్ల భాస్కరరావుల మధ్య బంధం చాలా బలంగా ఉండేది. ఒకరు అపారమైన ప్రజాకర్షణ కలిగిన నాయకుడైతే, మరొకరు తెరవెనుక రాజకీయ వ్యూహాలు రచించే మాస్టర్ మైండ్. అయితే, 1984 నాటికి ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని సంచలన నిర్ణయాల విషయంలో వీరిద్దరి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి.

1984memory
1984memory

1984memory | అభిప్రాయ భేదాల నుంచి అసహనం వరకు..
ముఖ్యంగా గ్రామ మునసబు, కరణం వ్యవస్థలను రద్దు చేయాలన్న ఎన్టీఆర్ నిర్ణయాన్ని నాదెండ్ల తీవ్రంగా వ్యతిరేకించారు. తన రాజకీయ అనుభవాన్ని, సలహాలను ఎన్టీఆర్ పక్కన పెడుతున్నారన్న అసహనం నాదెండ్లలో క్రమంగా పెరిగిపోయింది. ఒకరోజు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత, వీరిద్దరూ వ్యక్తిగతంగా చర్చించుకుంటున్న సమయంలో నాదెండ్ల తన అసంతృప్తిని సూటిగా వెళ్లగక్కారు.

ఎన్టీఆర్ ఇచ్చిన ‘షాకింగ్’ ఆఫర్
నాదెండ్ల విమర్శలను నిశ్శబ్దంగా విన్న ఎన్టీఆర్, ఒక్కసారిగా తన గంభీర స్వరంతో ఊహించని మాట అన్నారు. “బ్రదర్ నాదెండ్ల గారు.. నా నిర్ణయాల వల్ల మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే, ఈ ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత మీరే తీసుకోండి. నేనే రేపు ఉదయం గవర్నర్ దగ్గరకు వెళ్లి రాజీనామా ఇచ్చేస్తాను. మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయమని కోరతాను. నాకేం అభ్యంతరం లేదు” అని నిర్మొహమాటంగా చెప్పారు.

బీటలు వారిన బంధం
అప్పట్లో ఎన్టీఆర్ నోట ఆ మాట వినగానే నాదెండ్ల భాస్కరరావు ఒక్కసారిగా విస్తుపోయారట. ఎన్టీఆర్ ఆ మాటను ఎంత భావోద్వేగంతో అన్నారో ఆయనకు అర్థమైంది. ఆ సమయంలో నాదెండ్ల సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, వారిద్దరి మధ్య ఉన్న పాత స్నేహం అప్పటికే బీటలు వారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ చిన్న సంఘటనే తర్వాతి కాలంలో ఏపీ రాజకీయాలను కుదిపేసిన ఆగస్టు సంక్షోభానికి పునాది వేసింది.

చరిత్రలో నిలిచిన 31 రోజులు
ఎన్టీఆర్ ఆనాడు భావోద్వేగంతో అన్న ఆ మాటను నాదెండ్ల సీరియస్‌గా తీసుకున్నారో ఏమో కానీ, కొద్ది నెలలకే ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో.. ఆయనే స్వయంగా రాజీనామా అడగకుండానే, గవర్నర్ సాయంతో నాదెండ్ల ముఖ్యమంత్రి కుర్చీని అధిష్టించారు. అయితే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుణ్యమా అని, సరిగ్గా 31 రోజులకే నాదెండ్ల ఆ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఏపీ రాజకీయ చరిత్రలో ఈ డైలాగ్ మరియు ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఎప్పటికీ ఒక సంచలనమే.

click here to read more

click here to read August 1984 | నాదెండ్లను దెబ్బతీసింది..

Leave a Reply