Terrible incident | పాత కక్షలతో కుటుంబంపై దాడి

Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లాలో జూనియర్ లాయర్ ఎల్లయ్య దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో అతని కుటుంబంపై దుండగులు దాడి చేసినట్లు సమాచారం.

Terrible incident

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా కెవి పల్లి మండలం వడ్డిపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. జూనియర్ లాయర్ ఎల్లయ్య కుటుంబంపై గత రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు.

ఈ దాడిలో ఎల్లయ్య తీవ్రంగా గాయపడి మృతిచెందగా, అతని తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply