హైదరాబాద్ – తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్త లుగా నియమితులైన జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి , ఉప లోకాయుక్త జస్టిస్ బీఎస్ జగ్జీవన్ కుమార్ లు నేడు పదవీ బాద్యతలు స్వీకరించారు..రాజ్భవన్లో నేడు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి , ఉప లోకాయుక్త జస్టిస్ బీఎస్ జగ్జీవన్ కుమార్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని పదవీ బాధ్యతలు స్వీకరించిన లోకయుక్త, ఉప లోకయుక్తలను అభినందించారు.
సిఎం తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు , మహమ్మద్ అలీ షబ్బీర్ , వేం నరేందర్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.