కర్నూల్ బ్యూరో : ఇండియన్ మెడికల్ పార్లమెంటేరియన్స్ ఫోరమ్ జాయింట్ కన్వీనర్ గా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా.బైరెడ్డి శబరిని భారత ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి, ఇండియన్ మెడికల్ పార్లమెంటరియన్స్ ఫోరమ్ చైరఫర్సన్ జగత్ ప్రకాష్ నడ్డా (జేపీ నడ్డా) తెలిపారు. గౌరవప్రదమైన పార్లమెంట్ సభ్యులకు భారతదేశంలో ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించడంలో అచంచలమైన అంకితభావం, విశేషమైన సహకారాన్ని అందించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
AP | ఇండియన్ మెడికల్ పార్లమెంటేరియన్స్ ఫోరమ్ జాయింట్ కన్వీనర్ గా ఎంపీ బైరెడ్డి శబరి
