BCCI | మిగిలిన‌ ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణ‌కు వేదికలు ఎంపిక !

  • హైర‌దాబ‌ద్ కు చోటు

భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025ను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లను వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఐపీఎల్ షెడ్యూల్‌లోని మిగిలిన 16 మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ మూడు వేదికలను షార్ట్‌లిస్ట్ చేసింది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం కూడా ఈ జాబితాలో చేర్చారు.

హైద‌రాబాద్ తో పాటు… మిగిలిన మ్యాచ్‌లను దక్షిణ భారత్ లోని – బెంగళూరు, చెన్నైలలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. క్వాలిఫయర్స్, ఎలిమినేటర్స్, ఫైనల్ మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వవచ్చని సమాచారం.

ప్రస్తుతం, టోర్నమెంట్ నిలిపివేసే సమయంలో 12 లీగ్ మ్యాచ్‌లు, రెండు క్వాలిఫయర్లు, ఒక ఎలిమినేటర్ & ఫైనల్ మ్యాచ్ మిగిలి ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ మే 25న కోల్‌కతాలో జరగాల్సి ఉంది. టోర్నమెంట్ నిలిపివేసిన‌ సమయంలో, ప్ర‌స్తుతం గుజరాత్, బెంగళూరు, పంజాబ్, ముంబై టాప్ 4లో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *