IPL 2026 | ఢిల్లీ జట్టుతో కలిసిన పృథ్వీషా

IPL 2026 | ఢిల్లీ జట్టుతో కలిసిన పృథ్వీషా
ప్రత్యేక వీడియో విడుదల
IPL 2026 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారత యువ ఓపెనర్ పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో చేరాడు. గతంలో తన ఐపీఎల్ ప్రస్థానాన్ని ఈ ప్రాంచైజీతోనే మొదలు పెట్టాడు. ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆడాడు. ఫామ్ కోల్పోయిన పృథ్వీని ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఆ తర్వాత జరిగిన వేలంలో అతడిని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ 2026 వేలంలోనూ మొదట అతడికి నిరాశే ఎదురైంది. కానీ, చివరి రౌండ్లో (యాక్సిలరేటెడ్ ఫేజ్) అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్సే అతడిని రూ. 75 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసి తిరిగి జట్టులోకి తీసుకుంది.
ఈ సందర్భంగా ఢిల్లీ జట్టుతో కలిసిన సందర్భంగా పృథ్వీ షాపై ఢిల్లీ క్యాపిటల్స్ ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ‘మన అబ్బాయి ఇంటికి తిరిగొచ్చాడు’ అనే క్యాప్షన్తో ఈ వీడియోను పంచుకుంది. అందులో పృథ్వీ షా మాట్లాడుతూ.. “కోట్లా (అరుణ్ జైట్లీ స్టేడియం) లాంటి ప్రదేశాన్ని ఎవరూ మర్చిపోలేరు. అక్కడి శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని మర్చిపోలేం. కొన్ని కథలు ముగిసిపోవు, తిరిగి వస్తాయి. ఢిల్లీ.. మీ అబ్బాయి ఇంటికి వచ్చేశాడు” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించాడు.
