ఐపీఎల్ 2025లో భాగంగా నేడు అహ్మదాబాద్లో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్.. గుజరాత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తొంది.
ఓపైవు వికెట్లు పడుతున్న బౌండరీలు దంచేస్తున్నారు పంజాబ్ బ్యాటర్లు. ఈ క్రమంలో వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించాడు. 28 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.