ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలతో తమిళంలోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో వచ్చిన ‘లవ్ టుడే’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన ప్రదీప్… ఆ తర్వాత తమిళం, తెలుగు రెండింటిలోనూ ‘డ్రాగన్’ విజయంతో భారీ ప్రజాదరణ పొందారు.
ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి తమిళ-తెలుగు ద్విభాషా ప్రాజెక్టు #PR04 పనిచేస్తున్నాడు. ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం కానుండగా…. ‘ప్రేమలు’ చిత్రంతో ఆకట్టుకున్న మమిత బైజు కథానాయికగా నటించనుంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.
ఈరోజు ఈ సినిమా టైటిల్ను అధికారికంగా విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ను విడుదల చేయడంతో పాటు, విడుదల తేదీని కూడా ప్రకటించారు. యూత్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘డ్యూడ్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ఇక ఈ చిత్రం 2025 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.