Wishes – భువికి సునీతా విలియ‌మ్స్ రాక … “చిరు” సంతోషం

హైద‌రాబాద్ – వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపై ల్యాండ్ కావడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. 8 రోజుల్లో తిరిగొస్తామని వెళ్లి 286 రోజులకు హీరోచితంగా భూమిపైకి వచ్చిన వారికి సుస్వాగతం పలికారు. వీరి కథ అడ్వేంచర్ మూవీకి ఏ మాత్రం తీసిపోదని, బ్లాక్ బస్టర్ అని రాసుకొచ్చారు. సునీత, బుచ్ మరింత శక్తిని పొందాలని ఆకాంక్షించారు. కాగా మెగాస్టార్ చిరంజీవి నేడు బ్రిట‌న్ పార్లమెంట్ స‌భ్యులు నేడు స‌త్క‌రించ‌నున్నారు.. అలాగే జీవిత సాఫ‌ల్య పుర‌స్కారాన్ని కూడా ప్ర‌దానం చేయ‌నున్నారు.. దీని కోసం ఇప్ప‌టికే చిరంజీవి లండ‌న్ చేరుకున్నారు..

Leave a Reply