Sports | క్రికెటర్ త్రిషకు కోటి నజరానా.. ప్రకటించిన సీఎం రేవంత్
- అండర్ 19 వరల్డ్ కప్ విజయంతో మంచి పేరు
- తెలంగాణ యువతిగా మార్మోగిన గొంగడి త్రిష
- అండర్ 19 జట్టు మెంబర్ ధృతికి 10 లక్షలు
- భవిష్యత్లో మరింతగా రాణించాలన్న సీఎం రేవంత్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మహిళా క్రికెటర్ గొంగడి త్రిష మర్యాద పూర్వకంగా కలిశారు. అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. క్రికెటర్ త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు.
అంతేకాకుండా అండర్ 19 వరల్డ్ కప్ టీమ్ మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, సీఎం సెక్రటరీ షానవాజ్ ఖాసీం, తదితరులు ఉన్నారు.