AP | జగన్మాతను దర్శించుకున్న సీఎస్…
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనకదుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దర్శించుకున్నారు. బుధవారం కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు… రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ కార్యనిర్వాహణాధికారి కే.రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో రామచంద్ర మోహన్ వీరికి వేదపండితులుచే వేదార్వచనం కల్పించి, అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం చిత్రపటం అందజేశారు.