వెలగపూడి : ఏపీ బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల అంసెబ్లీలో ప్రవేశపెట్టారు. 3లక్షల 22వేల 359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్ ను రూపొందించారు.
రెవెన్యూ వ్యయం రూ. 2,51,162 కోట్లు.
రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు.
ద్రవ్య లోటు రూ. 79,926 కోట్లు.
మూల ధన వ్యయం రూ.40,635 కోట్లు
అమరావతి నిర్మాణానికి 6వేల కోట్లు, వ్యవసాయానికి 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31, 806కోట్లు కేటాయించారు.
శాఖల వారిగా వివరాలు..బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు కేటాయింపు
వైద్యరోగ్య శాఖకు 19265 కోట్లు కేటాయింపు
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 18848 కోట్లు కేటాయింపు
జలవనరుల శాఖకు 18 ఇరవై కోట్లు కేటాయిస్తూ నిర్ణయం
పురపాలక శాఖకు 13862 కోట్లు కేటాయింపు
ఇంధన శాఖకు రూ 13,600 కోట్లు కేటాయిస్తూ ఇచ్చిన ఆర్థిక మంత్రి
వ్యవసాయ శాఖకు 11636 కోట్లు
సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు కేటాయింపు
ఆర్థికంగా వెనుకబడిన సంక్షేమానికి 10,619 కోట్లు కేటాయింపు
రవాణా శాఖకు 8785 కోట్లు కేటాయింపు
సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటింది. అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు 62 కొట్లు, ధరల స్థికరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సృజన స్రవంతి గోదావరి డెల్టా కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు 11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు 6705 కోట్లు, జల్జీవన్ మిషన్ కోసం 2800 కోట్లు, అలాగే రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం 500 కోట్లు కేటాయించారు.