12:00 AM 18జూన్2026 ముఖ్యాంశాలు..
12:00 AM 18జూన్2026 ముఖ్యాంశాలు..
♦️ రెండున్నరేళ్లలోనే కోట్ల రుణ విముక్తి : ఎన్టీఆర్ జిల్లా వీరవల్లిలోని కృష్ణా మిల్క్ యూనియన్ ‘ప్రాజెక్ట్ కామధేను’ ప్లాంట్ కోసం తీసుకున్న రూ.110 కోట్ల రుణాన్ని కేవలం రెండున్నరేళ్లలోనే పూర్తిగా తీర్చింది. రోజుకు 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ బుడమేరు వరదల సమయంలో కూడా పాల సేకరణ, సరఫరాను నిరాటంకంగా కొనసాగించి రైతులకు అండగా నిలిచింది.
————————————————————————————-
♦️ విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు : తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు 1.621 శాతం డీఏ పెంపును ఆమోదించింది. ఈ నిర్ణయంతో 70,804 మంది లబ్ధి పొందనుండగా, భవిష్యత్ విద్యుత్ అవసరాలకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
————————————————————————————-
♦️ మోడీతో జెలెన్స్కీ భేటీ : ఫ్రాన్స్లోని ఎవియన్లో జరుగుతున్న జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, శాంతి, పునర్నిర్మాణం, వాణిజ్య సహకారంపై చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై కూడా ఇరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నారు.
————————————————————————————-
♦️ వైన్ షాపులో అగ్నిప్రమాదం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామంలోని వైన్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగింది. స్థానికులు, షాప్ నిర్వాహకులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో భారీ ప్రమాదం తప్పింది.
————————————————————————————-
♦️ నెదర్లాండ్స్పై భారత మహిళల ఘన విజయం : లీడ్స్లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత్ 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ను ఓడించి వరుసగా రెండో విజయం సాధించింది. స్మృతి మంధానా (74), షెఫాలీ వర్మ (55) రాణించగా, తెలుగమ్మాయి శ్రీ చరణి 4 వికెట్లతో విజయంలో కీలకపాత్ర పోషించింది.
————————————————————————————-
♦️ భారత మహిళల జట్టుకు భారీ షాక్ : మహిళల టీ20 ప్రపంచకప్లో నెదర్లాండ్స్తో మ్యాచ్ సందర్భంగా భారత స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ కుడికాలి చీలమండకు గాయపడి స్ట్రెచర్పై మైదానం వీడింది. గాయం తీవ్రంగా ఉంటే ఆమె ప్రపంచకప్ మిగతా మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉందని సమాచారం.
————————————————————————————-
♦️ ఐర్లాండ్ సిరీస్పై టెన్షన్ : అఫ్గానిస్థాన్తో లక్నోలో జరిగిన రెండో వన్డేలో సెంచరీ సాధించిన భారత వికెట్కీపర్ ఇషాన్ కిషన్ ఫీల్డింగ్ చేస్తూ భుజానికి గాయపడ్డాడు. గాయం తీవ్రతపై బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వకపోయినా, ఐర్లాండ్ టీ20 సిరీస్లో అతని పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
————————————————————————————-
ఫ్రాన్స్ పర్యటన చివరి దశలో మోడీ : ఫ్రాన్స్ పర్యటన చివరి దశలో ప్రధాని నరేంద్ర మోడీ పారిస్లో పలు అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో సమావేశమై పెట్టుబడులు, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ అంశాలపై చర్చించనున్నారు. అలాగే వివాటెక్-2026 సదస్సులో ప్రసంగించి భారత సాంకేతిక, స్టార్టప్ సామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.
