IPL 2026 Grand Final | ఇన్నింగ్స్ బ్రేక్లో అద్భుత లైట్ షో..
- కైలాష్ ఖేర్ పాటలు,
- శివ-థీమ్డ్ డ్రోన్ షోతో మైండ్ బ్లోయింగ్ విజువల్స్!
అహ్మదాబాద్: ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్లో భాగంగా గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. భారీ స్కోరు చేయలేకపోయిన నిరాశలో ఉన్న గుజరాత్ హోమ్ క్రౌడ్కు, మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్కు ఈ అద్భుతమైన ‘మిడ్-ఇన్నింగ్స్ లైట్ షో’ (Mid-Innings Light Show) సరికొత్త జోష్ను ఇచ్చింది.
ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ స్టేడియంలోని అత్యాధునిక ఎల్ఈడీ లైట్లు మైదానమంతా మ్యూజిక్ బీట్స్కు అనుగుణంగా మినుకుమినుకుమంటూ కనువిందు చేశాయి. స్టేడియం మొత్తాన్ని కాసేపు చీకటిగా మార్చి, ఆ తర్వాత లేజర్ వెలుగులతో చేసిన ఈ ప్రదర్శన ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్ మ్యాచ్కే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ మిడ్-ఇన్నింగ్స్ బ్రేక్లో స్టేడియంలోని లైట్లను కాసేపు ఆఫ్ చేసి, ఆకాశంలో అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీతో ఆవిష్కరించిన ఆ ‘శివ-థీమ్డ్’ (Shiva-themed) డిస్ప్లే అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. మన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతతో ముడిపెట్టి చూపించిన విధానం స్టేడియంలో ఉన్న వారినే కాకుండా, టీవీల ముందు కూర్చున్న కోట్ల మంది ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధులను చేసింది. లక్ష మందికి పైగా ప్రేక్షకులు చూస్తుండగా ఆ డిజిటల్ శివ రూపం ఆకాశంలో మెరుస్తుంటే వచ్చిన గూస్బంప్స్ మామూలుగా లేవు.
దీనికి తోడు స్టేడియం భక్తిరసం, నయా జోష్తో ఊగిపోయేలా ప్రముఖ లెజెండరీ సింగర్ కైలాష్ ఖేర్ తన పవర్ఫుల్ లైవ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆకాశంలో డ్రోన్లతో శివుని రూపాన్ని ఆవిష్కరించిన తరుణంలో.. కైలాష్ ఖేర్ తన విలక్షణమైన గొంతుతో పాడిన ఆధ్యాత్మిక గీతాలు స్టేడియంలో సరికొత్త ఎనర్జీని నింపాయి. లక్ష మందికి పైగా ఉన్న ప్రేక్షకులు తమ మొబైల్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసి కైలాష్ ఖేర్ సంగీత ప్రవాహంలో తేలియాడారు. క్రికెట్ మజాను, భారతీయ సంస్కృతిని మిక్స్ చేస్తూ ఐపీఎల్ నిర్వాహకులు ప్లాన్ చేసిన ఈ సరికొత్త షో ఫైనల్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.






