మహిళల సమస్యలపై అవగాహన..

మహిళల సమస్యలపై అవగాహన..
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : కదిరి టౌన్లో మహిళల సమస్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ఒక ముఖ్యమైన ర్యాలీ, సదస్సు నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఉదయం డీఎస్పీ కదిరి వారి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, REDS, సమత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సుమారు 100 మంది పాల్గొని ఇందిరాగాంధీ సర్కిల్ నుంచి తాయి గ్రాండ్ హోటల్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ర్యాలీ ద్వారా మహిళల భద్రత, హక్కులు, సామాజిక సమస్యలపై ప్రజలకు సందేశం అందించారు.

తదుపరి ప్రభుత్వ బాలికల హైస్కూల్లో సుమారు 200 మంది 9వ, 10వ తరగతి విద్యార్థినులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో డయల్-100 సేవలు, POCSO చట్టం, బాల్య వివాహాల నివారణ, ఈవ్ టీజింగ్ వంటి అంశాలపై విద్యార్థినులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో సీఐ కదిరి టౌన్, సీడీపీవో శ్రీమతి రాధిక, ఐసీడీఎస్ అధికారులు, REDS, సమత స్వచ్ఛంద సంస్థల సిబ్బంది, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మహిళల భద్రత, బాలికల రక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు.
