ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఈరోజు మరో కీలకమైన మ్యాచ్ జరగబోతోంది. ప్లే-ఆఫ్ రేసు కఠినంగా మారుతున్న కొద్దీ.. మ్యాచ్ లు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు టాప్ 4లో స్థానం కోసం పంజాబ్ – ఢిల్లీ జట్లు తలపడతాయి.
దర్మశాల వేదికగా జరుగుతున్నా ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించడంతో… రాత్రి 7గం. జరగాల్సిన టాస్ ఆలస్యం అయ్యింది. వర్షం తగ్గుముఖం పట్టిన తరువాతన టాస్ ను రాత్రి 8:15గం.లకు నిర్వహించారు. కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన
అయితే, మ్యాచ్ ధర్మశాలలో జరుగుతుండగా.. మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. దీంతో సాయంత్రం 7 గంటలకు జరగాల్సిన టాస్ ఆలస్యం అయింది. ఇక వర్షం తగ్గిన తర్వాత, రాత్రి 8:15 గంటలకు టాస్ నిర్వహించారు. ఇంతలో, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ చేయనంది.
తుది జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్ : ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, టి.నటరాజన్.
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
గెలిస్తే ప్లేఆఫ్స్ !
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో జోరుగా దూసుకుపోతోంది. పంజాబ్ జట్టు ఆడిన 11 మ్యాచ్ల్లో ఏడు గెలిచి, మూడు ఓడిపోగా ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం ఆ జట్టు 15 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
ఇక ఈరోజు జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిస్తే… 17 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్తును ఖాయం అవుతుంది. దీంతో, ఈ సీజన్లో ప్లేఆఫ్కు చేరుకున్న తొలి జట్టుగా పంజాబ్ నిలవనుంది. అందుకే ఢిల్లీని సొంతగడ్డపై ఓడించి ప్లేఆఫ్కు చేరుకోవడమే పంజాబ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఢిల్లీకి కీలకం !
ఐపీఎల్ 18వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్ కు పంజాబ్ కింగ్స్ పై విజయం అత్యవసరం. ఢిల్లీ జట్టు 11 మ్యాచ్ ల్లో ఆరు గెలిచి, నాలుగు ఓడింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఢిల్లీ ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లున్నాయి. దీంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే ఢిల్లీ పంజాబ్పై గెలవాల్సిందే. ఈ మ్యాచ్లో ఓడితే ప్లేఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టమౌతాయి.