NH Case |రాహుల్ , సోనియా గాంధీపై ఈడీ చార్జిషీట్

న్యూ ఢిల్లీ | నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ఢి ల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ చార్జిషీట్ దాఖలు చేసింది.

గాంధీ కుటుంబంపై తొలి ఛార్జ్‌షీట్ దాఖలైంది. సుమన్ దూబే, ఇతరుల పేర్లు ఛార్జ్ షీట్‌లో చేర్చారు. ఈడీ ఫిర్యాదుపై ఈ నెల 25న రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరుగనున్నది. ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో, ఈడి ఇప్పటికే రూ.64 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది.

రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ స్పందిస్తూ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మరికొందరిపై చార్జిషీట్ దాఖలు చేయడం ప్రధానమంత్రి, హోంమంత్రి ప్రతీకార, బెదిరింపు రాజకీయాలకు ఒక ఉదాహరణ అని అన్నారు.నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు ఏమిటి?నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు ఇండియన్ లిమిటెడ్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక మధ్య లావాదేవీలకు సంబంధించినది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు పార్టీ నిధులను దుర్వినియోగం చేశారని, AJL ఆస్తులను వారి ప్రైవేట్ నియంత్రణలో ఉన్న కంపెనీ ‘యంగ్ ఇండియన్’కు బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. పార్టీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టవిరుద్ధంగా ఉపయోగించారని ఈడి ఆరోపించింది.

ఈనెల 21న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు..?యంగ్ ఇండియన్‌లో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు 76 శాతం వాటా ఉందని దర్యాప్తులో తేలింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను 1938లో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, స్వాతంత్ర్య సమరయోధులు స్థాపించారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఈ వార్తాపత్రిక ఒక ప్రధాన వేదికగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *