Govt | ముగ్గురు ఏకగ్రీవ సర్పంచ్లు

Govt | ముగ్గురు ఏకగ్రీవ సర్పంచ్లు
- సర్పంచులను అభినందించిన మంత్రి వాకిటి
Govt | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని నిడుగుర్తి, ఎర్గాట్ పల్లి, తిమ్మారెడ్డి పల్లి గ్రామ పంచాయతీ సర్పంచు స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో మూడు స్థానాలు కాంగ్రెస్ ఖాతా(Congress Account)కు చేరాయి.
నారాయణపేట జిల్లాలో ప్రభుత్వం(Govt) మూడో విడత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మూడు స్థానాలు ఏకగ్రీవం కావడంతో రాష్ట్ర పాడి పరిశ్రమల క్రీడలు యువజన శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సర్పంచులుగా ఎన్నికైన వారిని బుధవారం ఫోన్ లో అభినందించారు.
ఆయా గ్రామాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, తన సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. నిడుగుర్తి బీసీ జనరల్ రిజర్వ్(General Reserve) సర్పంచ్ గా రాములు, ఎర్గాట్ పల్లి సర్పంచుగా బాలమొళ్ళ జయమ్మ, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్ గా చౌహన్ మోహన్ నాయక్ సర్పంచులుగా ఎంపికయ్యారు.
మూడు గ్రామ పంచాయతీల్లో వార్డు స్థానాలు సైతం ఏకగ్రీవం కావడంతో తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం ప్రత్యేక నిధులు(Special Funds) కేటాయిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా మూడో విడత సర్పంచ్ ఎన్నికల బరిలో 20 గ్రామ పంచాయతీలకు గాను 59మంది అభ్యర్థులు ఉండగా, 160 వార్డు స్థానాలకు జరిగే ఎన్నికలకు 357 మంది పోటీలో ఉన్నట్లు ఎంపీడీవో కిషోర్ కుమార్ తెలిపారు.
