తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు.ముందుగా సాయంత్రం 6 గంటలకు సీత లక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది.
ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు.
వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చినజీయర్ స్వామి, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఈ ఈ లు సుబ్రహ్మణ్యం, సుధాకర్, డి ఈ చంద్రశేఖర్, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.