Compared 2016 | భారత్‌లో అత్యంత రద్దీ విమానాశ్రయంగా గుర్తింపు

Compared 2016 | భారత్‌లో అత్యంత రద్దీ విమానాశ్రయంగా గుర్తింపు

Compared 2016 | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది. దేశంలోనే నాలుగో అత్యంత రద్దీ విమానాశ్రయంగా ఈ ఎయిర్‌పోర్ట్ నిలిచినట్లు వెల్లడైంది. విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం, 2016తో పోలిస్తే 2026 నాటికి నెలవారీ, వార్షిక ప్రయాణికుల రాకపోకలు రెట్టింపుకు మించి పెరిగాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణతో పాటు ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడం ఈ ఘనతకు కారణమైంది.

ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు, విస్తరించిన మౌలిక వసతులు, పెరిగిన విమాన సర్వీసుల కారణంగా శంషాబాద్ ఆర్‌జీఐఏ దేశంలోని ప్రముఖ విమానాశ్రయాల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.

Leave a Reply