వాషింగ్టన్ డిసి – అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.. భారత్ – పాకిస్థాన్ ల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిందని అయన తెలిపారు. ఈ మేరకు తన అధికార ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు.. ఇరు దేశాల అధినేతలతో గత రాత్రి అంతా చర్చలు జరిపామని, ఈ చర్చలు ఫలప్రదమయ్యాయని ఆయన పేర్కొన్నారు.. ఇరు దేశాలు విజ్ఞతతో వ్యవహరించి కాల్పుల విరమణకు అంగీకరించడం శుభపరిణామమని అన్నారు.. ఈ కాల్పుల విరమణ ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుందన్నారు ట్రంప్ . శాంతి కోసం ఒప్పందం కుదుర్చుకున్న ఇరు దేశాల అధినేతలకు ట్రంప్ అభినందనలు తెలిపారు.
Breaking News | భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణ – ఇరుదేశాలు అంగీకరించాయన్న ట్రంప్
