*విరివిగా విండ్ విద్యుత్ కేంద్రాలు
*ఇప్పటికే యుద్ద మందుగుండు సామగ్రి తయారీ సంస్థ
*పరిశ్రమలకు నిరంతర, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా
శ్రీ సత్యసాయి బ్యూరో .. (ఆంధ్రప్రభ):శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర ప్రాంతాన్ని పారిశ్రామికవాడగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పలువురు మంత్రులు పేర్కొన్నారు. కోస్తా ప్రాంతానికి దీటుగా శ్రీ సత్యసాయి జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచే విధంగా కృషి చేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. శుక్రవారం మడకశిరలో పలు విద్యుత్ సబ్స్టేషన్ల ప్రారంభోత్సవం కార్యక్రమానికి విచ్చేసి మాట్లాడారు.
ముఖ్యంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తదితరులు మాట్లాడారు. రాష్ట్రంలో 2019- 24 వరకు అధికారంలో ఉన్న వైకాపా పాలన వలన అన్ని విధాలుగా నష్టం జరిగిందన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి అనేది లేకుండా పోయిందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చి, అనంతరం తిరిగి వెనక్కు వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి, రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం అధినేతగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టడంతో పారిశ్రామిక అభివృద్ధి తిరిగి గాడిన పెట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అనేక పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థలు ముందుకు రావడమే నిదర్శనం అన్నారు.
ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మడకశిర ప్రాంతంలో యుద్ధ మందుగుండు సామాగ్రి అనగా తుపాకుల లో వాడే మందును తయారుచేసే పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 2000 మెగావాట్ల విండ్ విద్యుత్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలను ఆహ్వానించడం జరిగింది అన్నారు. ఇందుకు సంబంధించి నవయుగ సంస్థను సంప్రదించి చర్చించడం జరిగిందన్నారు. కాగా ఇప్పటికే జిల్లాలో ఈహెచ్ టి సబ్ స్టేషన్ లో 18, 33/11 సబ్ స్టేషన్ 145, 33 కెవి లీడర్స్ 121, 11 కెవి అగ్రికల్చరల్ ఫీడర్స్ 396, డిటిఆర్ఎస్ 89,942, సుమారు ఒక లక్ష 43 వేల ఎనిమిది వందల తొంబై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం పనిచేయడం ప్రారంభించామన్నారు. ఇంకా శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి, హిందూపురం ధర్మవరం పెనుకొండ రాప్తాడు మడకశిర నియోజకవర్గం 11 కొత్త 33/11 కె.వి సబ్ స్టేషన్ల వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఇంకా అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్ కూడా చేపడుతున్నాం. 2024 25 సంవత్సరంలో 715 డిటిఆర్ఎస్ ఎరెక్ట్ చేశామన్నారు. ఆర్డీఎస్ఎస్ కింద ఓవర్ లోడ్ 33 కెవి లీడర్ బైబర్కేషన్, సగ్రేషన్ ఆఫ్ 11 కెవి ఫీడర్స్ పనులు చేస్తున్నామన్నారు. కాగా ఆర్డీఎస్ఎస్ 2 కింద 33/11 కెవి సబ్ స్టేషన్ 155 ప్రపోజ్ చేశామన్నారు. *65 వేల గ్రూప్ టాకింగ్ సోలార్ కనెక్షన్లు… ఇదిలా ఉండగా 65 వేల రూప్ టాప్ సోలార్ కనెక్షన్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అన్నారు. పీఎం కోసం కింద ఈ జిల్లాలో 23 సబ్ స్టేషన్ లో పరిధిలో లీడర్ లెవెల్ సోలార్జేషన్ చేపడుతున్నామని మంత్రులు తెలిపారు. సమావేశంలో హిందూపురం ఎంపీ పార్థసారథి, మడచర్ ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుండుమల తిప్పేస్వామి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.