మే 1 నుంచి శాటిలైట్ ఆధారిత టోల్ విధానం అమలులోకి వస్తుందని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీనిపై కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శాటిలైట్ టోల్ అమలుపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది.