AP | విడదల రజనీపై కేసు న‌మోదు !

  • హైకోర్టు ఆదేశాల మేర‌కు కేసు

మాజీ మంత్రి విడదల రజనీపై కేసు న‌మోదైంది. ఏపీ కోర్టు ఆదేశాల మేర‌కు పల్నాడు జిల్లా పోలీసులను కేసు న‌మోదు చేశారు. 2019లో సోషల్ మీడియాలో ప‌లు పోస్టులు పెట్టి ప్రశ్నిస్తున్నాడని.. చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారంటూ విడుదల రజనిపై ఆరోపణలు నేప‌థ్యంలో విద‌ద‌ల రజినీపై కేసు న‌మోదైంది.

సోషల్ మీడియా కేసులో విడుద‌ల‌ రజనీ తనను అరెస్ట్ చేసి ఐదు రోజులపాటు స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని పిల్లి కోటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్పందించకపోవడంతో.. పిల్లి కోటి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ క్ర‌మంలో విచారణ చేపట్టిన హైకోర్టు రెండు వారాల్లోగా విడదల రజినితో పాటు ఆమె పీఏలు రామకృష్ణ, ఫణి.. అప్పటి సీఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో పల్నాడు పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Leave a Reply