ఇద్ద‌రు మృతి

ఇద్ద‌రు మృతి

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : హైద‌రాబాద్(Hyderabad) బేగంపేటలోని గ్రీన్ ల్యాండ్స్ వ‌ద్ద ఈ రోజు ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రాపిడో బైక్‌(Rapido Bike)ను ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో రాపిడో డ్రైవ‌ర్, ఆ బైక్‌పై ప్ర‌యాణిస్తున్న డాక్ట‌ర్(Dr) అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. స‌మాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు.

మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రి(Gandhi Hospital)కి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Leave a Reply