హైదరాబాద్ : ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం (క్రిమినల్ డిఫమేషన్) కేసును కొట్టివేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.
గత లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. బీజేపీ పరువుకు భంగం కలిగేలా రేవంత్ వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ, వాసం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రజాప్రతినిధుల కోర్టులో డిఫమేషన్ కేసును నమోదు చేశారు. ఈ కేసును విచారించిన జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2కి వాయిదా వేసింది.