గద్వాల (ప్రతినిధి) జూన్ 26 (ఆంధ్రప్రభ) : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సంచలనంగా మారిన గద్వాల సర్వేయర్ హత్య కేసు విచారణ ముగిసింది. ఈ విషయంపై జిల్లా ఎస్పీ టీ.శ్రీనివాసరావు (SP Srinivasa Rao) విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించారు. హత్య కేసులో కీలకంగా వ్యవహరించిన బ్యాంకు మేనేజర్ తిరుమలరావు (Tirumala Rao) కు కర్నూల్ కు చెందిన ఇదే బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తున్న సుజాతతో అక్రమ సంబంధం ఉండేదని, ఆ తర్వాత సుజాత కూతురు ఐశ్వర్యతో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్న సందర్భంలో ఐశ్వర్యకు గద్వాలకు చెందిన తేజేశ్వర్ తో కు పెళ్లి ఫిక్స్ అయ్యింది. దీంతో చేజేశ్వర్ ను చంపేందుకు పెళ్లి నిశ్చయం జరిగినప్పటి నుంచి స్కెచ్ వేశాడు బ్యాంకు మేనేజర్ తిరుమలరావు.
తేజేశ్వర్ (Tejeshwar) ను ఎలాగైనా హతమారిస్తే ఐశ్వర్యతో తన వివాహేతర సంబంధం కొనసాగించవచ్చునని బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావు ప్లాన్ వేసుకున్నాడు. ఈ క్రమంలో ఐశ్వర్యకు పెళ్లి అయిన నెలకి తన భర్తను హతమార్చడానికి ప్లాన్ వేసింది. దీంతో బ్యాంకు మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్య (Aishwarya) ఇద్దరు కలిసి జీవించాలని సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తేజేశ్వర్ ను హతమార్చేందుకు తన వద్దకు బ్యాంకు లోన్ కోసం వచ్చిన వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు బ్యాంకు మేనేజర్ తిరుమలరావు. అనంతరం తేజేశ్వర్ పై దాడి చేసేందుకు సుఫారీ గ్యాంగ్ ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో పొలం సర్వే చేయాలని తేజేశ్వర్ ను ఒక కారులో తీసుకొని వెళుతున్న సందర్భంలో డ్రైవర్ పక్కన కూర్చున్న తేజశ్వర్ ను వెనక సీట్లో కూర్చున్న వ్యక్తులు కతిత్తో దాడి చేసి చంపారు.
అనంతరం రక్తపు మరకలు అంటుకున్న తమ బట్టలు విప్పేసి కాలువలో పడేశారు. ప్లాన్ ప్రకారం ముందుగానే తెచ్చుకున్న కొత్త బట్టలు వేసుకున్నారు. తేజేశ్వర్ ను హతమార్చిన తర్వాత లడక్ ట్రిప్ వెళ్లేందుకు ఇద్దరు ప్లాన్ వేసుకున్నారని, ప్రస్తుతం బ్యాంకు మేనేజర్ తిరుమలరావు ఐశ్వర్యతో పాటు సుఫారి గ్యాంగ్ (Safari Gang) సభ్యులతో కలిసి మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. అలాగే హత్యకు ఉపయోగించిన కారు, కొడవళ్ళు 2, కత్తి, 10 మొబైల్స్, జిపిఎస్ పరికరంతో పాటు 1,20,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు, నిందితులను మహబూబ్ నగర్ జైలుకు తరలించినట్లు ఎస్పీ టి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
