KNL | యోగాను ప్రతి ఒక్కరూ దైనందిక జీవనంలో భాగం చేసుకోవాలి.. జాయింట్ కలెక్టర్

కర్నూలు బ్యూరో, జూన్ 9: ప్రజలు యోగాను తమ దైనందిన జీవనంలో భాగంగా చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (Joint Collector) డాక్టర్ బి.నవ్య పేర్కొన్నారు. యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా సోమవారం ఉదయం కలెక్టరేట్ (Collectorate) గాంధీ విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ నుండి రాజవిహార్ (Rajvihar) వరకు నిర్వహించిన మాస్ ర్యాలీని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా జేసీ మూడు రంగుల బెలూన్లను గాలిలోకి వదిలి ర్యాలీని ప్రారంభించారు.

ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… యోగాంధ్ర క్యాంపెయిన్ (YogaAndhra Campaign) లో భాగంగా గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ స్థాయిలో యోగా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ రంగోలి, వ్యాసరచన, వకృత్వ, యోగా పోటీలతో పాటు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రజలు యోగా పట్ల మంచి అవగాహనతో ఉన్నారని, యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా కార్యక్రమాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని లబ్ధి పొందాలని జాయింట్ కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ర్యాలీ (Rally) లో పాల్గొన్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, యోగాతో రోగాలు దూరం, యోగాతో మనసు ప్రశాంతంగా ఉంటుంది, యోగా ద్వారా ఆరోగ్యం ఆనందం పొందండని ర్యాలీలో ప్రజలు నినాదాలు చేస్తూ, ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాల్గొన్నారు.

ర్యాలీలో కర్నూల్ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డి టి సి శాంత కుమారి,డి ఎస్ ఓ రాజా రఘువీర్, డిఎంహెచ్ఓ శాంతి కల, హౌసింగ్ పీడీ చిరంజీవి, డి సి ఓ రామాంజనేయులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, డిఆర్డిఏ పిడి రమణా రెడ్డి, వెంకటరమణయ్య డ్వామా పిడి, ఆయుష్ డాక్టర్ ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ చిన్నబి.నవ్య రాముడు, గ్రౌండ్ వాటర్ డిడి శ్రీనివాసరావు, మెప్మా, ఫారెస్ట్ అధికారులు డి ఆర్ డి ఎ, మెప్మా ఆర్పీలు, సివోలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *