రైతుభరోసా కోసం దరఖాస్తులు చేసుకోవాలి…

రైతుభరోసా కోసం దరఖాస్తులు చేసుకోవాలి…
బిక్కనూర్, ఆంధ్రప్రభ : రైతు భరోసా పథకం కోసం రైతులు దరఖాస్తులు చేసుకోవాలని మండలంలోని బస్వాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి ప్రియాంక చెప్పారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ కొంతమంది రైతులు పూర్తి వివరాలు లేనందున పెండింగ్లో ఉందన్నారు. అట్టి రైతులు పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ తో రైతు వేదికలో సంప్రదించాలని ఆమె సూచించారు.
కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన రైతులు సైతం రైతు భరోసా కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. క్లస్టర్ పరిధిలోగల రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.
