Union Budget | 16 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణ‌కు గుండు సున్నా – ఎమ్మెల్సీ కవిత

కేంద్ర బ‌డ్జెట్ కేటాయింపుల‌పై క‌విత గ‌రం గ‌రం
రెండు జాతీయ పార్టీలు క‌ల‌సి ముంచేశారు
ఒక్క పైసా కూడా కేటాయించ‌క‌పోవ‌డం దారుణం

హైద‌రాబాద్ – ఆంధ్ర‌ప్ర‌భ – ”ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్లస్‌ ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎంపీలు ఇక్వల్‌ టూ జీ ఫర్‌ తెలంగాణ” అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క పైసా కూడా కేటాయించ‌క‌పోవ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వంపై ధ్వజమెత్తారు. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు వచ్చింది గుండు సున్నానే అని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రజలు చెరిసమానంగా ఎంపీ సీట్లు ఇచ్చినా వాళ్లంతా కలిసి రాష్ట్రానికి తెచ్చిందేమి లేదని ద్వ‌జ‌మెత్తారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ‌ను నిలువునా ముంచేశార‌ని వాపోయారు.. ఎప్పటి మాదిరిగానే నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష కొనసాగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *