కుప్పంపై తైవాన్​ ఆసక్తి

 రూ.400 కోట్లతో 470 ఎకరాల్లో ఇండో–తైవాన్ పారిశ్రామిక పార్కు

ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో:

చిత్తూరు జిల్లా కుప్పంలో (Kuppam) పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి అందే అవకాశం కనిపిస్తోంది. తైవాన్‌కు చెందిన అలీజియన్స్ గ్రూప్ సంస్థ (Tiwan Aligians)  జిల్లాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో జిల్లా అభివృద్ధి పథంలో కీలకమైన అడుగు పడబోతోంది. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తైవాన్ ప్రతినిధుల బృందం కలిసి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని, తమ ప్రభుత్వం పారిశ్రామిక విస్తరణకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశీయ, విదేశీ కంపెనీలు పెట్టుబడుల కోసం ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు. కుప్పం సమీపంలో 470 ఎకరాల్లో ఇండో–తైవాన్ పారిశ్రామిక పార్క్‌ను ( Indo Tiwan Industrial Park)  ఏర్పాటు చేయాలని తైవాన్ బృందం Tiwan praposd) ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు రూ.400 కోట్ల (Rs,400 crore)  పెట్టుబడి పెట్టేందుకు అలీజియన్స్ గ్రూప్ సిద్ధంగా ఉందని వారు సీఎం చంద్రబాబుకు వివరించారు. దీనితో పాటు తైవాన్‌కు చెందిన మరిన్ని సంస్థలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు పెరుగుతున్నాయని సూచించారు. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం ఆ బృందానికి హామీ ఇచ్చారు. ఈ పారిశ్రామిక పార్క్‌ ఏర్పాటుతో కుప్పం, పక్క ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రానున్నాయి.  ప్రాథమిక అంచనాల ప్రకారం మొదటి దశలోనే నేరుగా మూడు వేల మందికి, పరోక్షంగా పది వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ( Employment for 10,000 Youth) ప్రాజెక్టు పూర్తి అవుతే 50వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిశ్రమల్లో పనిచేసే అవకాశాలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. పార్క్‌లో ఎలక్ట్రానిక్స్ అసెంబ్లింగ్ యూనిట్లు, (Electronics assembling unit) యంత్రాంగ తయారీ కేంద్రాలు, చిన్న, మధ్య తరహా తయారీ పరిశ్రమలు, ప్యాకేజింగ్ యూనిట్లు, స్టార్టప్‌లకు అనువైన ఉత్పత్తి కేంద్రాలు ఏర్పడనున్నాయి. దీంతో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం చేకూరనుంది. పార్క్‌ స్థాపనతో స్థానిక రైతులకు కూడా ప్రయోజనం  కలగనుంది. భూమి విలువలు పెరిగి పక్క ప్రాంతాల్లో వాణిజ్య కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. రవాణా, గిడ్డంగి సదుపాయాలు, అతిథిగృహాలు, చిన్న సేవా రంగాలకు డిమాండ్ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. పరిశ్రమల రాకతో రహదారులు, నీటి సదుపాయం, విద్యుత్ వసతులు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. కుప్పం ప్రాంతం ఇప్పటికే జాతీయ రహదారి, రైల్వే కనెక్టివిటీతో Highway, Raikway connectivity) అనుకూల పరిస్థితుల్లో ఉండగా, ఈ పార్క్ ఏర్పాటుతో చిత్తూరు జిల్లా పారిశ్రామిక పటంలో ప్రధాన స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. తైవాన్ కంపెనీల పెట్టుబడులు రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి మేలు చేస్తాయని, కుప్పం ప్రాంతం కొత్త పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని పరిశ్రమలు శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply