Telangana | గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా

Telangana | గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా

Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తెలంగాన రాష్ట్రంలో జ‌న‌గ‌ణ‌న 2027 స్వీయ న‌మోదు ఇవాళ ప్రారంభ‌మైంది. లోక్‌భ‌వ‌న్‌లో గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా ఈ ప్ర‌క్రియను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్వీయగణనకు నమోదు చేసుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ కుటుంబ వివ‌రాలను జ‌న‌గ‌ణ‌న డైరెక్ట‌ర్ న‌మోదు చేశాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ చేసుకున్నారు. మే 10 వ‌ర‌కు జ‌న‌గ‌ణ‌న సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంది. తొలిసారి కుల‌గ‌ణ‌న‌ను డిజిట‌ల్ విధానంలో చేప‌డుతున్నారు. హిందీ, ఇంగ్లీష్‌తో స‌హా 16 భాష‌ల్లో సెల్ఫ్ ఎన్యూమ‌రేష‌న్ చేసుకునే అవ‌కాశం కేంద్రం క‌ల్పించింది.