RCB 2025 | ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పటీదార్

బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కొత్త సారథి వచ్చాడు. యువ బ్యాటర్ రజత్ పటీదార్ కు బాధ్యతలు అప్పగిస్తూ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. గత సీజన్ లో ఆర్సీబీని నడిపించిన డుప్లెసిస్ ను ఈసారి రిటైన్ చేసుకోలేదు.

విరాట్ కోహ్లి జట్టులో ఉన్నప్పటికీ.. కెప్టెన్సీ వైపు మొగ్గు చూపలేదు. పేసర్ భువనేశ్వర్ కుమార్తో పాటు కృనాల్ పాండ్య కూడా ఈ రేసులో నిలిచారు. అయితే, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రజత్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *