వెలగపూడి – మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించబోయే జనసేన ఆవిర్భావ వేడుకల నిర్వహణలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు..
పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, పి.ఓ.సి.లు, మండలాధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసే బాధ్యతను అప్పగించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
పార్లమెంట్ నియోజక వర్గాల సమన్వయకర్తల వివరాలు ఇవి….
శ్రీకాకుళం: కొరికన రవి కుమార్
విజయనగరం: లోకం నాగ మాధవి
విశాఖపట్నం: సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
అనకాపల్లి: పంచకర్ల రమేశ్ బాబు
అరకు: వంపూరు గంగులయ్య
కాకినాడ: తుమ్మల రామస్వామి
రాజమండ్రి: యర్నాగుల శ్రీనివాసరావు
అమలాపురం: బండారు శ్రీనివాసరావు
నరసాపురం: కొటికలపూడి గోవిందరావు
ఏలూరు: శ్రీ రెడ్డి అప్పల్నాయుడు
మచిలీపట్నం: బండి రామకృష్ణ
విజయవాడ: సామినేని ఉదయభాను
గుంటూరు: గాదె వెంకటేశ్వర రావు
బాపట్ల: శ్రీ వడ్రాణమ్ మార్కండేయబాబు
నరసరావుపేట: కిలారు రోశయ్య
ఒంగోలు: షేక్ రియాజ్
నెల్లూరు: వేములపాటి అజయ కుమార్
కడప: తాతంశెట్టి నాగేంద్ర
రాజంపేట: అతికారి కృష్ణ
కర్నూలు: చింతా సురేష్
నంద్యాల : నయుబ్ కమల్
అనంతపురం: టి.సి.వరుణ్
హిందూపురం: చిలకం మధుసూదన్ రెడ్డి
చిత్తూరు: డా.పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు

మార్చి 14వ తేదీన పిఠాపురంలో నిర్వహించే జనసేన ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించేందుకు 10 కమిటీలను ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్. లాజిస్టిక్స్, ప్రాంగణ నిర్వహణ, పబ్లిసిటీ – అలంకరణ, మెడికల్, మీడియా, సోషల్ మీడియా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, ఫుడ్, వసతి, పార్టీ వాలంటీర్స్ కమిటీలను నియమించారు.
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మార్చి 1వ తేదీన కాకినాడలో 10 కమిటీల సభ్యులతో, ఈ సభ కోసం నియమించిన పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. సభ నిర్వహణకు పవన్ కల్యాణ్ సూచించిన అంశాలను కమిటీల సభ్యులకు తెలియచేస్తారు
https://twitter.com/JanaSenaParty/status/1894066206421725335?t=FMI519GtdaVW2SAwmo3VZw&s=19